24, ఫిబ్రవరి 2011, గురువారం

మాటల తూటాల ముళ్లపూడి మరి ఇక లేరు

కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకటరమణ (80) గురువారం తెల్లవారుజామున మరణించారు. ముళ్లపూడి వెంకటరమణ, సినీ దర్శకుడు బాపు స్నేహానికి మారుపేరు. ఆనాటి సాక్షి చిత్రం మొదలు, నిన్న మొన్నటి రాధాగోపాలం చిత్రం వరకు బాపు నిర్మించిన ప్రతి చిత్రానికి ముళ్లపూడే రచయితగా పనిచేశారు.

తొలుత ఆంధ్ర పత్రికలో ఉప సంపాదకుడిగా జీవితం ప్రారంభించిన ముళ్లపూడి వెంకటరమణ బాపుతో కలిసి సాక్షి చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక చిత్రాలకు సృజనాత్మకత తెలుగు సినిమా రంగానికే కొత్త అందాలు తెచ్చిన ముళ్లపూడి సినీ రచయితగా అనేక చిత్రాలకు నంది అవార్డులు కూడా లభించాయి.ముళ్లపూడి రాసిన బుడుగు తెలుగు సాహిత్యంలో అత్యంత ముఖ్యమైనది. ముళ్లపూడి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందారు. ఈయన కుమారుడు యువ దర్శకుడు ముళ్లపూడి వర.