24, ఫిబ్రవరి 2011, గురువారం

మద్యాన్ని మైమరిపించే తియ్యదనం!

అల వాటులో పొరపాటు సహజమే కానీ, ఏదైనా అలవాటును పొరపాటున కూడా వదులుకోలేని బలహీనత మనలో చాలా మందిలో ఉంది. ఈ బలహీనతను ఆధారం చేసుకునే కాఫీ,తేయాకు, మద్యం, సిగెరెట్‌, పొగాకు ఉత్పత్తుల విక్రయం దారులు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు మొదలు పెద్ద ఉద్యోగాలు చేసే మధ్యతరగతి,ఉన్నత స్థాయి వర్గాల వారి వరకూ ఈ అలవాట్లలో కనీసం కొన్ని అయినా లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి కుటుంబాల్లో ఇంటి పెద్దల పట్ల భయం లేదా,గౌరవంతో చాటుమాటున ఈ వ్యసనాలకు పాల్పడే వారు ఇప్పుడు వ్యష్టి కుటుంబాల్లో బహిరంగంగానే ఇళ్ళలోనే ధూమపానం, మద్యపానం లాగించేస్తున్నారు. వీటి వల్ల ఆ యా వ్య క్తులకే కాక, కుటుంబ సభ్యులకు కూడా కేన్సర్‌, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి వ్యాధులు సంక్రమించడం మనం స్వ యంగా చూస్తున్నాం.

ఈ అలవాట్లన్నింటిలో మహ మ్మారి అనదగిన మద్యపానం గురించి ఎంత చెప్పినా, ఎందరు చెప్పినా, ఎన్ని సందర్భాల్లో చెప్పినా తక్కువే అవుతుంది. మద్యపానం వ్యసనాన్ని మాన్పించేందుకు ఇటు మన దేశంలోనూ, అటు విదేశాల్లోనూ వైద్యులూ, శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలే మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న దుస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రోగాలను నయం చేసే మందుల దుకాణాలు లేకపోయినా, ప్రతి వీధికీ ఒకటి లేదా రెండు మద్యం దుకాణాలు దర్శనమిస్తున్నాయి. మద్యం అమ్మకాలను ప్రభుత్వాలే ప్రోత్సహించడం ఆరు దశాబ్దాల స్వతంత్ర భార త దేశంలో మనం సాధించిన ప్రగతి. ఇంతకీ మందు మాన్పించే “డీ అడిక్షన్‌’ వైద్యం కూడా ఇప్పుడు నగరాలు, పెద్ద పట్టణాల్లో లభిస్తోంది.

మద్యం నియంత్రణ అనేది ఒక సాంఘిక ఉద్యమంగా సాగిన దృష్టాంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. తీపి పదార్ధాలను ఇష్టపడే వారు మద్యం వ్యసనం నుంచి తేలికగా బయటపడగలరని హెల్సింకీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌ఫేర్‌ సంస్థకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో తేలింది. మద్యం లేనిదే బతకలేని వారిలో స్వీట్లు ఇష్టపడే వారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్టు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.అలాగే,తియ్యని మాటల ద్వారా కూడా ఈ వ్యసనం బారి నుంచి తప్పించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

నాల్ట్రేగ్జిన్‌ అనే మందు సేవిస్తే మద్యం మీద ఆసక్తి క్రమంగా తగ్గుతుందనీ,అంతిమంగా ఆ అలవాటు నుంచి దూరం కావచ్చునని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హెల్సింకీలోని నేషనల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లో డేవిడ్‌ సిన్‌క్లార్‌ అనే పరిశోధకుడు, ఆయన సహచరులు పరిశోధనలు చేసి ఈ మందును కనుగొన్నారు.

ఆస్ట్రేలియాలో పదేళ్ళ వయసు గలవారు,ఇంకా అంతకన్నా చిన్న వారూ మద్యానికి బానిసలు అవుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరిని మద్యం వ్యసనం కోరలనుంచి తప్పించేందుకు మెల్‌బోర్న్‌,సిడ్నీ తదితర నగరాల్లో యత్నా లు సాగుతున్నాయి. ఇందుకోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, మత్తు కోసం, అదే విధమైన ఆనందం కోసం పిల్లలు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారనీ, ఇంట్లో తల్లితండ్రుల అలవాట్లు, జీవన విధానం,బయట వాతావరణం అన్నీ కూడా వారిని మద్యం వైపు నడిపిస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. మెల్‌బోర్న్‌లో ఒడెస్సీ హౌస్‌ ఈ మధ్య ఒక సర్వేని నిర్వహించింది. 15-24 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలూ, యువకులూ మద్యం కారణంగా అకాల మరణం పాలవుతున్నారనీ, ఇలా మరణించేవారి సంఖ్య ఏటా 264 వరకూ ఉంటుందని ఈ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ పిట్స్‌ తెలియజేశారు.

కాగా, మద్యం వ్యసనం వల్ల ప్రపంచ వ్యాప్తం గా ఏటా 20 లక్షల మంది పైగా మరణిస్తున్నట్టు ప్ర పంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తున్నది.ఇలా మరణించేవారిలో వేలాది మంది యువకులు తప్పనిసరిగా ఉంటున్నారని ఆ సంస్థ పేర్కొం ది. మద్యం వ్యసనం వల్ల యవ్వనంలోనే వృద్ధాప్యపు లక్షణాలు మనిషిలో కనిపించడం, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరి తిత్తులు చెడిపోవడం సర్వసాధారణమవుతోందనీ, బ్రెస్ట్‌ కేన్సర్‌ వంటి భయంకర మైన వ్యాధుల బారిన పడుతున్నారని అంటు వ్యాధుల నిరోధం, మానసిక ఆరోగ్యం విభాగం అసిస్టెంట్‌ డైరక్టర్‌ జనరల్‌ అలా అల్వాన్‌ తన పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నారు. రష్యాలో ప్రతి ఐదుగురిలో ఒకరు మద్యం కారణంగానే మరణిస్తున్నట్టు ప్రపంచ వ్యాప్తంగా అందిన సమాచారాన్ని క్రోడీకరించి విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. బ్రెజిల్‌, కజకస్థాన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, యుక్రేయిన్‌లలోకూడా మద్యం మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. కల్తీ మద్యం కారణంగా మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రం లో ఎంతో మం ది బలి అవుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మద్యాన్ని మాన్పిం చేందుకు వ్యసనపరులకు కౌన్సిలింగ్‌ నిర్వహించే కేంద్రాలు కూడా పెద్దనగరాలు,పట్టణాల్లో ఇప్పటికే వెలిశాయి. అయితే, ఇవి సొమ్ము చేసుకునేందుకు కొందరికి ఉపాధి కేంద్రాలుగా ఉపయోగ పడుతున్నాయి తప్ప ఆచరణలో తగిన ఫలితం కనిపించడం లేదు, మద్యాన్ని మాన్పించేందుకు స్వాతం త్య్రోద్యమంలో “కల్లు మానండోయ్‌’ అనే గీతాల ద్వారా జనాన్ని చైతన్యపర్చేవారు. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన రోశమ్మ అనే ఆమె నాయకత్వంలో మహిళలు ఉద్యమించారు. మళ్ళీ అలాంటి ఉద్యమం వస్తేనే మద్యం నియంత్రణ సాధ్యం అవుతుంది.