24, ఫిబ్రవరి 2011, గురువారం

తెలంగాణ ద్రోహిని బర్తరఫ్ చేయాలి :టీఆర్‌ఎస్

రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్‌లో తెలంగాణబిల్లు ప్రవేశపెట్టాలంటూ లోక్‌సభలో నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చర్య సహేతుకం కాదని మొయిలీ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మొయిలీ న్యాయశాఖ మంత్రిగా తగరన్నారు. మొయిలీని ప్రధానమంత్రి వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజ్‌గోపాల్‌లు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగంపై అవగాహన లేని మొయిలీమాటల వెనక అజ్ఞానం కనిపిస్తోందన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవ కేటీఆర్ వ్యాఖ్యానించారు.