6, ఫిబ్రవరి 2011, ఆదివారం

నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమం తప్పదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇప్పటి వరకు చేపట్టిన ఉద్యమాలు ఒక ఎత్తయితే ఇప్పు డు చేపట్టబోయే సహా య నిరాకరణ ఉద్యమం చివరి అస్తమ్రని తెలంగాణ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీంద ర్ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.

సహాయ నిరాకరణోద్యమం ద్వారా ఎలాంటి ఇ బ్బందులు తలెత్తినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ నెల 12న జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో పరిస్థితులు, ప్రభావిత అం శాలు తదితర విషయాలపై జేఏసీల నిర్ణయా లు, సలహాలు, సూచ నల మేరకు ముసాయిదా తయారు చేసి, దానికి విధివిధానాలను క్రోడీకరించి నివేదిక ప్రకటిస్తామని తెలిపారు.