2, నవంబర్ 2010, మంగళవారం

24న బీఈడీ ఇన్‌స్టెంట్ పరీక్ష

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ విద్యార్థులకు ఈ నెల 24న ఇన్‌స్టెంట్ పరీక్ష నిర్వహించ నున్నట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి తెలిపారు. 2009-10సంవత్సరం బ్యాచ్‌కు సంబంధించి ఆగస్ట్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో ఒక థియరీ పేపర్‌లో ఫెయిలైన విద్యార్థులు మాత్రమే ఇన్‌స్టెంట్‌కు అర్హులు. ఈ నెల 12వ తేదీలోగా రూ. 3 వేల ఫీజు చెల్లించాలి. పరీక్ష 24వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.