2, నవంబర్ 2010, మంగళవారం

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌లో విజిలెన్స్‌ సోదాలు


ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు జరిపారు. ఏఐసీసీ భూములు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై విచారణలో భాగంగా మాదాపూర్‌లోని రహేజా ఐటీ పార్క్‌లో ఉన్న ఎమ్మార్‌ సంస్థ కార్యాలయంపై విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

డీఐజీ హరికుమార్‌ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఎమ్మార్‌, ఏపీఐఐసీ మథ్య అగ్రీమెంట్‌ చేసుకున్న పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.




from surya