2, నవంబర్ 2010, మంగళవారం

ఇక్కడో మాట, అక్కడో మాట మారుస్తున్నానా .....


హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో తాను ఇక్కడో మాట, అక్కడో మాట మారుస్తున్నానని న్యాయవాదులు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవని న్యాయశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.

ఏడాదికి పైగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు ఈ డిమాండ్ సరైనది కాదన్నారు. హైకోర్టు బెంచ్ డిమాండ్ ఈ నాటిది కాదని, 40 ఏళ్ల నుంచి ఉన్నదేనని.... డిమాండ్ న్యాయబద్ధమైనదే అన్న విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి విభేదం లేదని చెప్పారు. ఆందోళన విరమించి కోర్టులకు హాజరు కావాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేసి నా నిరసనలు కొనసాగించడం శోచనీయమని.... ఇప్పటికైనా కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఆందోళనలు విరమించాలని కోరారు