2, నవంబర్ 2010, మంగళవారం

తెలంగాణ బిడ్డనే, రాజకీయాలు తెలియవు


పల్లెలన్నా పల్లె ప్రాంతాల ప్రజలన్నా తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాదవ్ అన్నారు అత్తగారి ఊరైన శాయంపేటకు తల్లి సావిత్రి, భార్య వాణి శ్రీ, పిల్లలు ప్రభాకర్, సావికర్‌లతో వచ్చిన సందర్భంగా కాసేపు మీడియాతో మాట్లాడుతూ ..గ్రామంలోని ఆం జనేయస్వామి ఆలయంలో నవగ్రహ, భూ లక్ష్మీ, బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టాపన వేడుకల కోసం వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 350 చిత్రాల్లో నటించినట్లు తెలిపా రు.

శాయంపేట గ్రామంలో కళ్యాణ వేదిక, కళావేదికలను, స్థానిక పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా కత్తి కాంతారావు, కత్తి అనే రెండు సి నిమాల్లో నటించానని, విడుదలకు సిద్ధం గా ఉన్నాయన్నారు. తన పిల్లలను సినిమారంగం వైపు మల్లించనని చెప్పారు. తెలంగాణపై అభిప్రాయం అడగ్గా, తాను తెలంగాణ బిడ్డనని, రాజకీయాల గురించి తెలియదని అన్నారు.