2, నవంబర్ 2010, మంగళవారం

డీఎస్సీ నియామకాలలో జోక్యం చేసుకోo

: డీఎస్సీ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోమని రాష్ట్ర హైకోర్టు స్ఫష్టం చేసింది. కామన్‌ మెరిట్‌కు విరుద్ధంగా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని, డీఎస్సీ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ బీఎడ్‌ అభ్యర్థులు సోమవారం వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో జీఓ నెంబర్‌ 28 ప్రకారమే డీఎస్సీ నియమాకలు జరగనున్నాయి. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో సెలెక్షన్‌ జాబితాను విద్యాశాఖ ప్రకటించింది. బుధవారం నుంచి కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. గత రెండు రోజులుగా సిర్టిఫికేట్ల వేరిఫికేషన్‌ ఇవాల్టితో ముగిసింది