8, నవంబర్ 2010, సోమవారం

భారత్‌, కివీస్‌ తొలి టెస్ట్‌ డ్రా

భారత్‌, న్యూజిలండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 6 వికెట్ల నష్టానికి 82 పరుగులతో ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆట ప్రారంభించిన భారత్‌ 266 పరుగులకు అలౌట్‌ అయ్యింది.

లక్ష్మణ్‌ ( 91), హర్భజన్‌ సింగ్‌ (115) జహీర్‌ఖాన్‌ 0, శ్రీశాంత్‌ 4 పరుగులు చేశారు. అనంతరం 294 పరుగల లక్ష్మంతో బరిలోకి దిగిన కివీస్‌ 10 ఓవర్లు ఆడిన 22 పరుగులు చేసింది. 22/1 స్కోరు వద్ద ఇరు జట్లు కెప్టెన్ల అంగీకారం మేరకు చివరి రోజు 15 ఓవర్లు ఉండాగానే అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.