9, డిసెంబర్ 2011, శుక్రవారం

మరలిరాని మన జాతి సంపద

కోహినూరు వజ్రం... మయూర సింహాసనం... శివాజీ ఖడ్గం... హౌప్‌ వజ్రం...తైమూరు చక్రవర్తి కెంపుల హారం
ఃబర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ః...ఇలా అనేక మన వారసత్వ సంపదలు దేశం వీడి ఏళ్ల్లు గడిచాయి. చాలా వరకు విదేశాల్ల్లో మ్యూజియాల్లో దర్శనమిస్త్తుంటే మరి కొన్ని మహరాణుల నగల మాటున మూలుగుతూ... కంటికి కనిపించనంత దూరంగా ఉన్నాయి. ఇవన్నీ మనవే అని యావత్‌ ప్రపంచానికి తెలిసినా... ఎప్పటికైనా అవి మన దేశానికి రాకుండా పోతాయా అంటూ... ఆశావాదుల్లా...కళ్లల్లో వత్తులేసుకుని నిరీక్షించడం మినహా..తిరిగి తెచ్చుకోలేని దుస్ధితి మనది... ఇంతకీ మన దేశాన్ని వీడిపోయిన అపార సంపదల్లో కొన్నింటిని తరచి చూస్తే....
రత్నగర్భగా పేరెన్నికగన్న మన భారతావనిలోని అపార సంపదపై దృష్టి కేంద్రీకరించిన అనేక మంది విదేశీయు లు అనేక దండ యాత్రలతో కొందరు.. వ్యాపారం పేరుతో మరి కొందరు..మన రాజుల్ని మచ్చిక చేసుకుని ఇంకొందరు మన దేశంలోకి అడుగుపెట్టి కోట్ల విలువ చేసే అనేక వజ్రవైఢూ ర్యాలను, బంగారు సంపదల్ని తరలిం చుకుపోయారు. వాస్తవాలు ప్రపంచావనికి తెలిసినా... మన కేంద్ర విదేశాం గ మంత్రిత్వశాఖ ఃమా సంపద మా కివ్వండంటూ విజప్తులు చేస్తూ... చేతులు దులుపుకోవటంతో ఇక మనం మన దేశం లో ఒకపðడు ఉండేదట.. అని అనుకుంటూ...వాటి చరిత్రల్ని.. పుస్తకాల పుటల్లో చదువుకుంటూ... ఎక్కడో ఓదగ్గర సురక్షితంగా ఉన్నా యని సంతృప్తిపడుతూ.. ఉండిపోవాల్సిందేనా అన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తున్న క్రమంలో ఇప్పటికే జనం సమస్యలే పట్టని మన నేతలు వీటిని తిరిగి రప్పించేం దుకు ఏమాత్రం తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తారో చూడాలి. కాస్త వివరాల్లోకి వెళ్తే...
కోహినూర్‌ వజ్రం :
భారత దేశ చరిత్రలో కోహినూర్‌ వజ్రానికి ఓ ప్రత్యేక స్ధానం ఉంది. మన కృష్ణాపరివాహక ప్రాంతంలో వజ్రం దొరికిన ఈ వజ్రం14వ శతాబ్దంలో మొఘ ల్‌చక్రవర్తి బాబరు చెంతకు చేరింది. ఆపై షాజహాన్‌ తన నెమలి సింహాసనంలో ఈవజ్రం పొదిగించాడనీ.మొఘలాయిల వారసత్వ సంపద గా వచ్చిన ఈవజ్రంపై కన్నేసిన నాదిర్షా 1739 లో ఢిల్లీపై దండెత్తి నాటి మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షాను ఓడించి...కోహినూర్‌ వివరాలు కను క్కు ని...తన సుహృద్భా వానికి చిహ్నంగా తల పాగాలు

మార్చి.. షా తలపాగాలోని వజ్రాన్ని చూసి ఃకోV్‌ా- ఇ-నూర్‌ః అని అప్రయత్నంగా అన్నాడని... దీంతో ఆ పేరే దానికి స్ధిరపడి పోయిందని చరిత్ర కారులు చెప్తారు.
నాదర్షా ఎత్తుకు పోయిన ఆ వజ్రం 1747లో కుర్దిష్‌ తెగల పై ఆయన దాడులని ప్రతిఘటించిన సొంత అనుచరగణం చేతిలో కన్ను మూయగా...వారి ద్వారానే 18వ దశకంలో మన దేశంలోని షాజాఅనే రాజుని చేరింది. అయితే షాజాని బంధించిన కాశ్మీర్‌ రాజుని ఓడించి నందుకు ప్రతిగా.. షుజాభార్య లాహౌర్‌ మహారాజు రంజిత్‌సింగ్‌కు అంద చేయగా.. ఆయన తన తదనంతరం కోహినూరు పూరీ జగన్నాధు డికి చెందేలా విల్లు రాసి చనిపోయాడు. అయితే అప్పటికే ఈ దేశంలో బ్రిటీష్‌ పాలకుల దాష్టికాలు ప్రారంభమై అపార సంపదని తమ దేశానికి తీసుకుపోవటం ప్రారంభించా రు.ఈక్రమంలోనే వారి పాలబడ్డ కోహి నూర్‌ను ఏప్రిల్‌ 6, 1850న హెచ్‌.ఎం.ఎస్‌. మీడియా నౌక ద్వారా బొం బాయి తీరం నుండి ఇంగ్లాడుకు ఎన్నో ఒడిదుడుకుల నడుమ తరలిం చుకుపోయారు.
అప్పట్లో ఈ వజ్రాన్ని తిరిగి భారతావనికి రప్పించేం దుకు రంజిత్‌ సింగ్‌ వారసుడైన దులీప్‌సింగ్‌ లార్డ్‌ డల్హౌసీతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సరికదా దాన్ని విక్టోరియా మహారాణికి భద్రంగా పంపాడు. అత్యంత విలువైన ఆ వజ్రం బ్రిటీష్‌ మహారాణి కిరీటం లో చోటు దక్కించుకుని... నేడు అత్యంతభద్రత సందర్శ కులకు కనువిందు కలిగిస్తూ... సేద తీరుతోంది.
నెమలి సింహాసనం
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తాజ్‌మహల్‌ నిర్మాత మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ ఎంతో ఇష్టపడి తయారు చేయించుకున్న సింహాసనం ఇది. ఆయన పాలనంతా దాదాపు దీని మీద నుండే చేసావా రని చరిత్ర చెప్తున్న సత్యం. కొన్ని కేజీల బంగారంతో తయారు చేసిన దీనికి 108 కెంపులూ, 116 పచ్చలూ ఇంకా అనేక అమూల్య వజ్రాలూ, రత్నాలతో దాన్ని అలంకరించారని, దీనిపై భాగంలో అమర్చిన నెమలి ముత్యాల తో.. పింఛóమంతా పచ్చని కెంపులతో.. ప్రపంచంలోని కెంపుల్లో రెండో అతిపెద్ద కెంపు తైమూర్‌ రూబీ వంటి అమూల్య రత్నాలు ఆకర్షణీయంగా తయారైన ఈ సింహా సనాన్ని సైతం నాదిర్షా తరలించుకు పోయాడు
అప్పటికి ఆ సింహాసనం విలువ పదికోట్ల రూపాయలు అంటే తాజ్‌ మహల్‌ నిర్మాణానికి చేసిన ఖర్చు కన్నా దాదాపురెట్టింపు అన్న మాట. నాదిర్షా హత్య అనంత రం.. ఎవరి చేతికందినదివారు పట్టుకు పోయిన క్రమంలో ఈ నెమలి సింహాసనం పూర్తిగా ధ్వంస మైందని కొందరు చెప్తుం డ గా అది కాలక్రమంలో ఇరాన్‌ చేరిందని కొందరు చెప్తారు. కాగా ఇది అసలైన సింహా సనం కానే కాదని కేవల నకలు మాత్రమేనని ఇర్విన్స్‌ వంటి చరిత్ర కారులు వాదిం చిన సందర్భాలూ ఉన్నాయి.
హామీ హుళక్కేనా..

ప్రస్తుతం కాశ్మీర్‌ ముఖ్య మంత్రిగా ఉన్న ఒమర్‌ అబ్ధుల్లా విదే శాంగ మంత్రిగా కోహినూ రు వజ్రం, నెమలి సింహాసనాలను వెనక్కి తెచ్చేందుకుప్రయత్నాలు చేసు ్తన్న ట్లు ప్రకటన చేసి దశాబ్ధం గడిచినా కనీసం ఆదిశగా ప్రయత్నాలు దాదాపు శూన్యం అవ్వటంతో వీటికి ఇక నీళ్లొదులు కోవాల్సిన పరిస్ధితి నెలకొందన్నది మాత్రం యదార్ధం.