11, డిసెంబర్ 2011, ఆదివారం

అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష : బాబా రామ్‌దేవ్‌

గోవాలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తక్షణమే తగుచర్యలు తీసుకుని అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని రామ్‌దేవ్‌ గోవా ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ''వచ్చే సంవత్సరంలో జరుగను న్న ఎన్నికలకు ముందు అక్రమ మైనింగ్‌ వ్యతిరేకంగా తామంతా ప్రచారం చేయను న్నాం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, అసెంబ్లిdకి దోపిడీదారులు ఎన్నిక కావడాన్ని అనుమతించం'' అని రామ్‌దేవ్‌ బాబా పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌ కు వ్యతిరేకంగా 'గోవా బచావో సమ్మేళన్‌' పేరుతో నిర్వహించిన సభలో బాబా రాందేవ్‌ పాల్గొని ప్రసంగి ంచారు. ఈ సందర్బ éంగా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌ కార్యకలా పాలకు వ్యతిరేకంగా గోవా రాష్ట్ర వ్యాప్తం గా పర్యటించనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్లు రాందేవ్‌ బాబా వెల్లడించారు.
చైనా ఉత్పత్తులను బహిష్కరించండి
ఆర్థిక రంగంలో భారత్‌కు పోటీగా తయా రవుతున్న చైనాను అడ్డుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందని, ఇందులో భాగంగా చైనా ఉత్పత్తులను బహిష్క రించాలని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు.