11, డిసెంబర్ 2011, ఆదివారం

'ఆధార్‌' భవితవ్యం ప్రశ్నార్థకం

కేంద్ర హోంమ ంత్రిత్వ శాఖ సందేహాలు వ్యక్తం చేయడం తో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత ్మకంగా చేపట్టిన 'ఏకీకృత గుర్తింపు కార్డు (యుఐడి) పథకం' భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 'యుఐడి' స్థానంలో కొత్త బిల్లును తీసుకు రావాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచిం చింది. అయితే అధికార వర్గాలు మాత్ర ం, యుపిఎ ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని కాపాడేం దుకు చివరి ప్రయత్నాలు జరుగుతున్నా యి. పార్లమెంటరీ స్థాయీ సంఘం, హోం మంత్రిత్వ శాఖ సందేహాలు త్రోసి రాజని ఈ ప్రాజెక్ట్‌ కొనసాగించేందుకు ప్రణాళికా సంఘం, కేబినెట్‌కు ఓ ముసాయిదాను సమర్పిం చినట్లు సమాచా రం. 'యుఐడిఎఐ' ప్రాజెక్ట్‌ను భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆమోదించే విధంగా నిబంధనలను సవరించాలని ప్రణాళికా సంఘం తన ముసాయిదాలో సూచించి నట్లు తెలిసింది. బయో మెట్రిక్‌ విధానం లేకుండానే జన గణన ప్రక్రియ పూర్తయిందని ప్రణాళికా సంఘం పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే కోస్తా తీర ప్రాంతాల్లో బయో మెట్రిక్‌ విధానం ద్వారా జన గణన ప్రక్రి య సగభాగం పూర్తయిందని చెబుతున్న హోంశాఖ, 'ఆధార్‌' పథకం ఖర్చును కూడా ప్రశ్నిస్తోంది. దేశ వ్యాప్తంగా జాతీయ జనాభా రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో రూ.6650 కోట్ల ఖర్చుతో జన గణన పూర్తి చేస్తుండగా, ఆధార్‌ ప్రాజెక్ట్‌కు రూ.18 వేల కోట్లు అవసరమ వుతాయని హోంశాఖ వాదిస్తోంది.