28, ఫిబ్రవరి 2011, సోమవారం

ధర్మాన ఇలాఖాలో మళ్ళి పేలిన 'ధర్మల్' తూటా..

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పట్టు చూపించేందుకు 'ధర్మల్'నే శ్రీకాకుళం ప్రజల మీద ఆయుధంగా ప్రయోగిస్తున్నట్టు ఉంది. తమ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ఆందోళనకారులపై సోమవారం పోలీసులు మూడుసార్లు బాష్పవాయివు ప్రయోగించారు. పల్లె ప్రజలపై పోలీసు తూటాలు.. పొగబాంబులు వెల్లువలా కురిశాయి.దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీస్ జీపులను తగులబెట్టారు.

పొగబాంబుల తాకిడికి పూరిళ్ళు అంటుకుని మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారు 150 ఇళ్ళు అంటుకున్నట్లు సమాచారం. బాధితుల ఆక్రందనలు,, పోలీసుల బూట్ల చప్పుడు, ఆందోళనకారుల పరుగులతో వడ్డితాండ్ర వణికిపోతున్నది. ఈ ఘటనలతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.