28, ఫిబ్రవరి 2011, సోమవారం

మాజీ సిఎం రోశయ్యపై కేసు పెట్టండి : హైకోర్టు

హైదరాబాదీ అత్యంత ఖరీదైన ప్రాంతం మైత్రివనంలోని స్థల వివాదంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై విచారణపై విధించిన స్టేని సోమవారం హైకోర్టు ఎత్తివేసింది. అమీర్పేట భూముల వ్యవహారానికి సంబంధించి రోశయ్యతోపాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎసిబిని హైకోర్టు ఆదేశించింది.దీనితో ఈ వ్యవహారంలో జరిగిన అధికార దుర్వినియోగం, తదితర అంశాలపై ఎసిబి విచారణ జరపనుంది.