28, ఫిబ్రవరి 2011, సోమవారం

మా వాళ్ళూ గాయపడ్డారు.. డిఐజి సౌమ్య మిశ్రా

వడ్డీ తాండ్ర లో జరిగిన ఘటనలో తమ పోలీసులు 20 మంది గాయపడ్డారని చెప్పారు డిఐజి సౌమ్య మిశ్రా. సోమవారం ఆమె వడ్డీ తాండ్ర గ్రామాన్ని సందర్శించి .. పోలిస్ కాల్పుల్లో గాయపడ్డ ప్రజలని.. పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. జరిగిన ఘటన బాధాకరమే అయినా... తమ పోలీసులు చాలా సంయమనం తో వ్యవహరించారని... ఐతే గ్రామస్తులే పోలీసులపై దాడి చేయటంతో తప్పని పరిస్తితిలోనే భాష్పవాయువు ప్రయోగించారని.. అప్పటికి గ్రామస్తులు వెనక్కి తగ్గక పోవటంతో రబ్బరు బులెట్లు మాత్రమే వినియోగించారని..చెప్పారామే. ముగ్గురు గ్రామస్తులు ఈ ఘటనలో మృతువాత పడగా ... ప్రజలతో పాటు పోలీసులు కూడా గాయాలపాలయ్యారని.. చెప్పారు. శాంతి యుతంగా నిరాహార దీక్ష శిబిరాన్ని నడుపుకొంతామంటీ తము అబ్యంతర పెట్టబోమని... ఐతే... రహదారుల దిగ్భందం, పోలీసులని కవ్వించడం వంటి చర్యలను సహించ బోమని తీల్చి చెప్పారు సౌమ్య మిశ్రా