28, ఫిబ్రవరి 2011, సోమవారం

మంత్రి పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే

తెలంగాణ అంశంపై సోమవారం కూడా శాసనసభ దద్ధరిల్లింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, తెలంగాణను అడ్డుకున్నది ఎవరో బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పారని తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.ఓ దశలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపైకి తెలుగుదేశం శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి దూసుకెళ్లారు. ఆయనను కాంగ్రెసు సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.