28, ఫిబ్రవరి 2011, సోమవారం

జగన్ ఆస్తులపై 'సభ'ని స్థంభింపజేస్తాo...

వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపైన పార్లమెంటులో జెపిసి మాదిరిగా ఇక్కడ జాయింట్ లెజిస్ట్రేటివ్ కమిటీ వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సాక్షిలో దొంగ పెట్టుబడులు ఉన్నట్లు ఐటి శాఖ తేల్చి చెప్పిందని... అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటానికి గల కారణమేమిటని ప్రశ్నించారు.

జగన్ ఆస్తులపై ప్రభుత్వం జెఎల్‌పి వేయకుంటే శాసనసభా సమావేశాలను స్థంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని అన్నారు.