28, ఫిబ్రవరి 2011, సోమవారం

పేల్చినవి రబ్బరువే.. ఐనా చనిపోయారు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో ఈస్టుకోస్టు థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ కి వ్యతిరేకంగా.. ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయమని చెప్పామే తప్ప.. ఎక్కడా తము కాల్పులకు ఆదేశాలు జారీ చేయలేదని డిజిపి అరవింద రావు చెప్పారు.

రబ్బరు బుల్లెట్లు మాత్రమే ప్రయోగిస్తున్నారని, వాటి వల్ల ప్రాణానికి హాని జరుగదని తెలిపారు. ఐతే రబ్బర్ బుల్లెట్ కాల్పులలో ఒకరు మృతి చెందారని డిజిపి ప్రకటించడం ఆశ్చర్యకరం..పోలీసులు, ప్రజలు సంయమనం పాటించాలని ఓ వైపు కోరుతూనే...ఆందోళనకారులు పోలీస్ జీపు తగులబెట్టడాన్ని ఆయన ఖండించారు.