28, ఫిబ్రవరి 2011, సోమవారం

జైపాల్‌ హామీకి ప్రణబ్‌ ఎసరు ?

ఇప్పట్లో పెట్రో ధరలు పెంచే ప్రసక్తే లేదంటున్న ఆ శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి హామీలకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎసరుపెట్టారు. సోమవారం 2011-12 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖర్జీ అన్నారు. బడ్జెట్‌లో కస్టమ్‌, ఎక్సైజ్‌ సుంకాలను యథాతథంగా కొనసాగించడంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌ ముడిచమురు ధరలు 110 యూఎస్‌ డాలర్లకు పెరిగింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయికి సమానం.

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై 7.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తున్నారు. అలాగే లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.14.35, డీజిల్‌పై లీటరుకు రూ.4.60 విధిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో పెట్రో ధర పెంచక తప్పడంలేదు.