28, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రణబ్ బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారంనాడు పార్లమెంటులో 2011-2012 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు.

బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

-నల్లధనాన్ని వెలికి తీసేందుకు అయిదు అంచెల విధానం

-చేనేత రంగం ఉద్దీపనకు చర్యలు

-నాబార్డు ద్వారా రూ.3000 కోట్లు వితరణ

- 2011-12లో 7 నుంచి 8 లెదర్ హబ్స్ ఏర్పాటు

-నల్లధనం విదేశాలకు తరలకుండా ప్రత్యేక విధానం

-బ్లాక్ మనీ వెలికితీతకు చట్టం చేసే యోచన

- 15 మోగా ఫుడ్ పార్కుల ఏర్పాటు

-త్వరలో జాతీయ ఆహార భద్రతా బిల్లు

- 2012 ఏప్రిల్ 1 నుంచి ప్రత్యక్ష పన్నుల విధానం

-2.50 లక్షల గ్రామ పంచాయితీలకు గ్రామీణ ఇంటర్నెట్ సౌకర్యం

-అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంపు ( రూ.700 ఉన్నకార్యకర్తలకు రూ.1500, రూ.1500 ఉన్న కార్యకర్తలకు రూ.3000 చెల్లింపు)

-పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 60వేల గ్రామాలకు రూ.300 కోట్లతో ప్యాకేజీ

-రూ.7,300 కోట్లు పట్టణాల దగ్గర

- రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు పావలా వడ్డీకే రుణాలు

-పశుగ్రాస నివారణకు రూ.300 కోట్లు

- భారత నిర్మాణ రంగ కార్యక్రమానికి రూ.58వేల కోట్లు

-విద్యారంగానికి రూ. 52,057 కోట్లు

-విద్యాహక్కు చట్టం కింద మరో రూ.21 కోట్లు

-అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి రూ.244 కోట్లు

- గ్రామీణ బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్లు

-ఆరోగ్య రంగానికు రూ.26, 760 కోట్లు

-చిన్న, సన్నకారురైతుల రుణాల కోసం ప్రత్యేక నిధి

-అసంఘటిత రంగాలలో స్వాలంభన పింఛన్ విధానం మరింత సరళీకృతం

-హరిత భారత్ పథకానికి రూ.200 కోట్లు

-రుణాల ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

- ఈ సమావేశాల్లోనే ఇన్సూరెన్స్ సవరణ , ఎల్‌ఐసీ బిల్లులు

-2వేలు జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకుల ఏర్పాటు

-ఈ ఏడాది కొత్తగా 20వేల గ్రామాలకు బ్యాంకింగ్ సదుపాయం

-జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి రూ.8వేల కోట్లు

-వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 9,890 కోట్లు

-ఐఐటీ ఖరగ్‌పూర్‌కు రూ.200 కోట్లు , ఐఐఎం కోల్‌కతాకు రూ.20 కోట్లు

-రక్షణ రంగానికి రూ.69,199 కోట్లు

- కొత్త గిడ్డంగుల ఏర్పాటుకు రూ.2వేల కోట్లు

-ముస్లిం వర్సీటీలకు రూ.50 కోట్లు

-గంగానది మినహా నదులు, సరస్సుల శుద్ధికి రూ.200 కోట్లు

-ముస్లిం యూనివర్శిటీలకు రూ.50 కోట్లు

-మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో విదేశీ పెట్టుబడులు పెంపు

-వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి 1.8 లక్షలకు పెంపు

జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కులాల ఆధారంగా జనగణన

-ఇప్పటివరకూ 20 లక్షల ఆధార్ నెంబర్లు జారీ

- త్వరలో కొత్త రుపాయి నాణాలు.

- చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రత్యేక నిధి