7, ఫిబ్రవరి 2011, సోమవారం

విలీనంపై వివరణకు ‘చిరు” భారీ బహిరంగ సభ

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందో ప్రజలకు సాధారణ కార్యకర్తలకు వివరించేందుకు త్వరలోనే ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసున్నట్లు తాజా కాంగ్రెస్‌ నేత, మాజీ రాజ్యసభ సభుడు సి.రామచంద్రయ్య ప్రకటించారు.

సోమవారం ఆయన నూఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.... ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని... సోనియాతో భేటీ విశేషాలను వివరించేందుకు తమ పార్టీకి చెందిన నేతలు, శాసనసభ్యులతో రేపటి నుండి రెండ్రోజుల పాటు ప్రత్యేక సమావేశాన్నిఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారాయన.


పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు చాలా మందికి ఇష్టంలేదంటూ మీడియాలో వచ్చిన కధనాలు వాస్తవం కాదని...తమ పార్టీలో ఒకరిద్దరు తమ అభిప్రాయాలు చెప్పారని... అయినా మెజార్టీ సభ్యుల నిర్ణయం మీదే చిరంజీవి పార్టీని విలీనానికి అంగీకరించారని స్పష్టం చేసారు రామచంద్రయ్య.