3, మార్చి 2011, గురువారం

ఆత్మ ప్రభోధం సాక్షిగా రాజీనామా : జూపల్లి

మంద బలంతో సీమంద్ర నేతలు తెలంగాణాని అడ్డు కొంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గురువారం తన రాజీనామా లేఖని ముఖ్యమంత్రికి అందచేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ... దమ్ము ధైర్యం గురించి కొందరు సీమాంధ్ర నేతలు రేచ్చగోట్టే లా మాట్లాడుతున్నారని.. వారి బెదిరిపులకి తానూ లొంగలేదని.. గతంలో ఉస్మానియాలో విద్యార్దుల సమక్షంలోనే తానూ ఏ త్యాగానికైనా సిద్దమని చెప్పానని చెప్పారు. పదవులతో పాటుగా తాము పుట్టలేదని... తెలంగాణా వాడిగా.. తన ఆత్మ ప్రభోదం మేరకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ...తెలంగాణా విషయంలో హై కమాండ్ పై వత్తిడి తెచ్చేన్డుకీ ఈ రాజీనామా... అప్పటికీ కేంద్రం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలో తెలంగాణా బిల్ పెట్టకపోతే తానూ ఆమరణ దీక్షకు దిగుతానని చెప్పారు. ఎప్పుడు ఎలాంటి ఎత్తుగడ అవసరమో అదే అవలంబిస్తున్నానని స్పష్టం చేసారు జుపల్ల్లి... తమ రాజీనామా తరువాత ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని భావిస్తున్నా.. ఉదోగుల సహాయనిరాకరణకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారాయన.