3, మార్చి 2011, గురువారం

తెలంగాణ సమస్యను ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమస్యను ఎలా పరిష్కరించాలో మాకు తెలుసునని..కేంద్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ సమస్యకు కేంద్రం ఓ పరిష్కారాన్ని త్వరలో సూచిస్తుందని త్వరలోనే.. కేంద్రం ఈ తెలంగాణ అంశంపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో తెలంగాణ నినాదాలు చేస్తూ... సభా కార్యక్రమాలకు అడ్డు తగల టంపై సమాధానమిస్తూ..."రాత్రి 9 గంటలకు తెలంగాణ ప్రాంత ఎంపీలతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మినహా కోర్ కమిటీ అంతా భేటీ అయ్యే అవకాశం ఉంది.వారికి తగురీతిన సమాధానం ఈ సమావేశంలో లభిస్తుందని" జవాబిచ్చారు మొయిలీ.