25, మార్చి 2011, శుక్రవారం

సచిన్ కోసం వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపం

క్రికెట్ ప్రియుల ఆరాధ్యదైవమైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం బెంగుళూరులోని శ్రీసాయిగోల్డ్ ప్యాలెస్ నిర్వాహకులు టి.ఎ.శరవణ సుమారు 4.5 కిలోల బంగారు తాపడం చేసిన వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపాన్ని సిద్దం చేశారు. 4.5 కిలోల బరువున్న ఈ వెండి ట్రోఫీకి బంగారు తాపడం చేయడానికి 60 గ్రాముల బంగారాన్ని వినియోగించినట్లు తెలిపారు. దీంతోపాటు ఒక బాల్, బ్యాట్ కూడా తయారు చేసినట్లు..ఈ ట్రోఫీ, బాల్, బ్యాట్ తయారీకి రూ.5 లక్షలు వెచ్చించినట్లు టి.ఎ.శరవణ తెలిపారు.