1, మార్చి 2011, మంగళవారం

తెలంగాణ బాబు చేతుల్లోనే ఉంది

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ పూటకో మాట మాట్లాడుతోందని..ఆ పార్టీ చేస్తున్న విన్యాసాల వల్లనే తెలంగాణ సమస్య జఠిలమైందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని.. తెలంగాణ సమస్య పరిష్కారం తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేతుల్లోనే ఉందని, తెలిసి కూడా ఆయన తో నేటికీ ఎలాంటి ప్రకటనా చేయించని నేతలు... కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సమంజసం కాదని.. ఇప్పటికైనా బాబు తన వైఖరి చెపితే కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకొనే వీలు కలుగుతుందని వ్యాఖ్యానించారు బొత్స.


ఈ రాష్ట్రంలో 34 శాతం ఓట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంగా గౌరవించి విస్మరించకూడదని కాంగ్రెసు పార్టీ భావిస్తోందని..అందువల్లే చంద్రబాబు నిర్ణయం కోసమే వేచి చూస్తోందని... తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి కొంత సమయం పట్టవచ్చునని ఇప్పటికైనా చంద్రబాబు తెలంగాణాపై తన వైఖరి ప్రకటించి సమస్యకు ముగింపు పలికేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేసారు బొత్స.