1, మార్చి 2011, మంగళవారం

వెంకటేశ్‌ నాయకత్వంలో తారల క్రికెట్‌

సెలబ్రిటీస్‌ క్రికెట్‌ లీగ్‌ (సి.సి.యల్‌) మార్చి 5న డే, నైట్‌ మ్యాచ్‌ కర్టెన్‌రైజర్‌గా నిర్వహిస్తారు. తెలుగు, కన్నడ, తమిళ బాలీవుడ్‌ హీరోల మధ్య క్రికెట్‌ పోటీ జరుగుతుంది. దక్షిణాది టీమ్‌కు కెప్టెన్‌గా వెంకటేశ్‌ వ్యవహరిస్తారు. టీమ్‌కు యజమాని మంచు మనోజ్‌. సిసియల్‌ గురించి వివరించడానికి శనివారం ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు.
కెప్టెన్‌ హోదాలో వెంకటేశ్‌ మాట్లాడుతూ జూన్‌ నుండి క్రికెట్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. నాలుగు టీమ్‌లుంటాయి. తెలుగు, కన్నడ, తమిళ భాషల నుండి ఒక టీమ్‌, ముంబాయి నుండి మరో టీమ్‌ ఏర్పడుతుంది. వైజాగ్‌లో ఈనెల 5న వీరిమధ్య 20-20 మ్యాచ్‌ కర్టెన్‌రైజర్‌గా జరుగుతుంది అన్నారు.

కెప్టెన్‌గా వెంకటేశ్‌ వ్యవహిస్తున్న టీమ్‌కు సుదీప్‌ వైస్‌ కెప్టెన్‌. ఇందులో సూర్య, శరత్‌కుమార్‌, మంచు విష్ణు, సిద్ధార్థ్‌, తరుణ్‌, తారకరత్న, అబ్బాస్‌, ఆర్య, శ్యామ్‌, శంతన్‌ భాగ్యరాజ్‌ ఉన్నారు. టీమ్‌ అంబాసిడర్‌లుగా శ్రీయశరణ్‌, ప్రియమణి, ఛార్మి, తాప్సి, సమంతా, అంద్రిత, రాగిని వ్యవహిస్తారు. ముంబాయి హీరోస్‌ టీమ్‌లో సల్మాన్‌ఖాన్‌, సునీల్‌శెట్టి, రితీష్‌దేశ్‌ముఖ్‌, సోహాలిఖాన్‌, సోనూసూద్‌ తదితరులుంటారు. జనీలియా, సోనాలి అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తారు.