1, మార్చి 2011, మంగళవారం

సీమాంధ్ర పొలిమేరల దాకా తరిమి తరిమి కొడతాo

తెలంగాణాకి అడ్డు పడుతున్నచంద్రబాబు నాయుడు, జేసీ దివాకర్ రెడ్డితో సహా ఇతర సీమాంధ్ర నాయకులను తెలంగాణాలో తిరగనివ్వమనీ, వారిని సీమాంధ్రకు తరిమికొడతామని.. ఉస్మానియా జేఏసీ హెచ్చరించింది.మంగళవారం తెలంగాణా జేఏసీ పిలుపు మేరకు జరిగిన రైల్ రోకో కార్యక్రమంలో ఉస్మానియా విద్యార్దులు విద్యానగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు భారీ ఎత్తున పట్టాలపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా విద్యార్ధి నేతలు మాట్లాడుతూ.. తెలంగాణా ఏర్పాటుకు సహకరిస్తే ఆత్మీయుల్లా కలిసి ఉండటం జరుగుతుందనీ,లేదంటే సీమాంధ్ర వాసుల ఆస్తులపై భౌతిక దాడులకు దిగుతామని, సీమాంధ్ర పొలిమేరల దాకా తరిమి తరిమి కొడతామని హెచ్చరించింది.