1, మార్చి 2011, మంగళవారం

'మహాప్రస్థానం' ప్రారంభం

పి.యస్‌.ఎమ్‌. ప్రొడక్షన్స్‌ శ్రీకృష్ణ గొర్లెని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న మహాప్రస్థానం చిత్రం షూటింగ్‌  రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పి.శ్రీనివాసరావు ఈ చిత్రానికి నిర్మాత. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి డాక్టర్‌. డి.రామానాయుడు క్లాప్‌ ఇవ్వగా, సీనియర్‌ నటుడు సుమన్‌ కెమెరా స్విచాన్‌ చేశారు.
నలుగు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వీరి మధ్య ప్రారంభమైన ప్రేమ ఎన్నెన్ని మలుపులు తిరిగి చివరికి ఏగమ్యానికి చేరింది అనేది చిత్రకథాంశం అన్నారు.నిర్మాత పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 15 నుండి రగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌, వైజాగ్‌, గోవా, మలేషియాలో షూటింగ్‌ చేస్తాం. ఒక ప్రముఖ హీరో ప్రత్యేక పాత్రని చేస్తారు. మనిషాచటర్జీ నాయికగా నటిస్తుంది. ఆగస్టు 15న సినిమాను రిలీజ్‌ చేస్తాం అన్నారు.
ఈ చిత్రానికి పాటలు చంద్రబోస్‌, సంగీతం కనిష్క, ఛాయాగ్రహణం పెమ్మసాని సురేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.నందు.