8, ఫిబ్రవరి 2011, మంగళవారం

నన్ను చూపించరా?.. మీడియాకు బాబు క్లాస్‌

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం గుం టూరులో మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ఛానెళ్లు ప్యాకేజీలుగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని విమర్శించారు. 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను తనకన్నా వెనుక వచ్చిన జూనియర్లతో పోటీ పడాలా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం కష్టపడుతున్న తనకు కేవలం 3 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారన్నారు.

కాగా, ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తనకు తెలుసని బాబు అన్నారు.