8, ఫిబ్రవరి 2011, మంగళవారం

జగన్‌ మావైపే.... డిఎస్‌

చిరంజీవితో వచ్చిన ఎమెల్యేల సంఖ్య చూసుకుని..జగన్‌ వెంటవెళ్తున్న ఎమ్మెల్యేలపై వేటుకు సిద్దపడు తున్నట్లు వస్తున్న కధనాలు వాస్తవం కాదని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తేల్చి చెప్పారు.

మంగళవారం ఆయన ఢిల్లీ వెళ్తూ కాసేపు విలేఖర్లతో మాట్లాడుతూ...చిరంజీవితో వచ్చిన ఎమెల్యెలని చూసుకుని..జగన్‌ వెంటవెళ్తున్న ఎమ్మెల్యేలపై వేటుకు సిద్దపడుతున్నట్లు వస్తున్న కధనాలు వాస్తవం కాదని, ‘తన తండ్రి అధికారంలోకి తీసుకువచ్చిన ఈప్రభుత్వాన్ని కూలదోయనని జగన్‌ చెప్తున్నారని... అవసరమొచ్చినపుడు జగన్‌ కూడా మా వెంటే నడుస్తాడుకాంగ్రెస్‌ పార్టీలో చేరతాడు’ అని ధీమా వ్యక్తం చేసారు డిఎస్‌.

వైఎస్‌ హయాంలో జరిగిన పాలనంతా అవినీతిమయమంటూ ఇటీవల పీఆర్పీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తున్న సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేసిన వాఖ్యలపట్ల మాట్లాడేందుకు నిరాకరించారు.చిరంజీవి ఎందుకు అలా మాట్లాడారొ.. తనకి తెలియదని తప్పించుకుంటునే... చిరం జీవి చేరిక వల్ల కాంగ్రెస్‌ పార్టీలో అయోమయం నెలకొందన ్నవాదన సరికాదని... త్వరలోనే అన్నింటినీ అధిగమించి ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు మొత్తం కలగల్సి మరింత బలంగా తయారు కాబోతోం దని అన్నారు.