11, నవంబర్ 2010, గురువారం

విశాఖలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం

విశాఖపట్నంలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖమంత్రి కపిల్‌సిబాల్‌ తెలిపారు.

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ... దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 14 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు... ఈ విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోని విశాఖతో పాటు భువనేశ్వర్‌, కొచ్చి, అమృతసర్‌, గ్రేటర్‌ నొయిడా, పాట్నా, గౌహతీ, కొల్‌కతా, భోపాల్‌, గాంధీనగర్‌, కోవై, మైసూర్‌ , పూణె...తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు కపిల్‌సిబాల్‌ వెల్లడించారు.