2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో కుంభకోణంపై టెలికాం శాఖ మంత్రి ఎ.రాజా రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను డిఎంకె తోసిపుచ్చింది. మంత్రి పదవికి రాజా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ట్రాయ్ నియమాల ప్రకారమే ఆయన వ్యవహరించారని ఆ పార్టీ పేర్కొంది.
'రాజా ఎందుకు రాజీనామా చేయాలి? ఈ విషయంలో సిబిఐ విచారణ జరుగుతోంది. విచారణ ముగిసే వరకూ ప్రతిఒక్కరూ వేచిఉండాలి' అని డిఎంకె ప్రతినిధి, ఆ పార్టీ లోక్సభ సభ్యుడు టికెఎస్ ఎలగోవన్ అన్నారు.