10, ఫిబ్రవరి 2011, గురువారం

జగన్‌ దగ్గరేమైనా ‘జాదూ’ ఉందా?

2009 ఎన్నికల్లో తన ఆస్ధి కేవలం 2 కోట్లుగా చూపిన కడప మాజీ ఎంపి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్‌ తన ఆదాయాన్ని లక్షల కోట్లుగా చూపిస్తు... ముందస్తు పన్నుగా 85 కోట్లుప్రభుతానికి చెల్లించడం వెనుక జాదూ ఏమైనా ఉందేమో? అనే సందేహాన్ని వ్యక్తం చేసారు రాష్ట్త్ర చేనేత, జౌళి శాఖా మంత్రి శంకరరావు .

గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇన్నివేల కోట్లు హఠా త్తుగా రాత్రికిరాత్రే ఎలా పుట్టుకొచ్చాయన్న అనుమానమే తనని కోర్టుకు లేఖ రాసేందుకు పురికొల్పిందని అన్నారు. జగన్‌ ఆస్తుల మర్మం అందరికీ తెలిస్తే మంచిదే కదా? అన్నారు.

తెలంగాణా రాష్ట్రం కోసమే శ్రీకృష్ణకమిటీని ఏర్పాటు చేసినట్లు కొందరు వాదించడం సరికాదని... కమిటీ కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుంది. వీటిని పరి గణలోకి తీసుకుని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్‌ పార్టీయే ఏ నాటికైనా తెలంగాణ ఇచ్చెది తెచ్చేది అని తెలిసినా..అని తెలిసినా..కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలకు దిగుతుండటం వల్లే ఆలస్యమ వుతోందనిపిస్తోందని అన్నారు శంకరరావు.