10, ఫిబ్రవరి 2011, గురువారం

సోనియాకు సబ్బం ‘హరి’ హెచ్చరికలు

జననేతగా ఎదిగిన జగన్‌ని అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా చేష్టలు చేసి ఇబ్బందులు పెట్టాలని భావిస్తే.....కాంగ్రెస్‌ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కాంగ్రె స్‌ పార్టీకే చెందిన పార్లమెంట్‌ సభ్యుడు, జగన్‌ వర్గ నేత సబ్బం హరి హెచ్చ రించారు.

గురువారం జగన్‌ హరిత యాత్ర ముగింపు సమావేశంలో ఆయన మాట్లా డుతూ... ఇందిరాగాంధీ చనిపోయాక ఆయన కుమారుడు రాజీవ్‌ని ప్రధానిని చేసి న కాంగ్రెస్‌ మన రాష్ట్రంలో మాత్రం మరో తరహాలో వ్యవహరించిందని... వైఎస్‌ మరణానంతరంఆయన కుమారుడు జగన్‌ని శాసనసభ్యులు తమనేతగా ప్రకటించి నా ఇప్పటికి ఇద్దరి సిఎంలని చేసి ద్వంద్వ పరిణామాలు పాటించిందని... జగన్‌ని ఎందుకు సియం చేయలేదో చెప్పాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాని నిలదీసారు.

జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏం చేసారంటున్న నేతాశ్రీలకు తన జవాబొక్కటే... తన హయాంలో కొన్ని పత్రికలు పనికట్టుకుని కాంగ్రెస్‌ిని విమర్శల పాలు చేస్తుం టే... వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకు జగన్‌తో పత్రికని పెట్టించారని... రాష్టంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటానికి వైఎస్‌ కృషి ఎంతుందో...ఆపత్రిక రాసిన వాస్త వాలు చెప్పి రెండోసారి అధికారంలోకి రావటానికి అంతే కృషి చేసిందని... పొగిడి న నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటేదని నిలదీసారు.ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌ కుక్కలు చించిన విస్తరిగా మారిందని,వాస్తవాలు ఇలా ఉంటే, తప్పుడు నివేదికలు పంపిన పెద్దలే ఈ స్ధితికి కారణమని అధిష్టానం గమనించాలని సూచించారు.