10, ఫిబ్రవరి 2011, గురువారం

టిక్కెట్లమ్ముకుని ఛానల్‌ పెట్టిన ఘనత బాబుదే...

తెలుగుదేశం పార్టీ అధినేత రాష్టంలో భారీఎత్తున అవినీతి జరిగిపోతోందం టూ గగ్లోలు పెట్టడం విచిత్రంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ పర్చూరు శాసనస భ్యుడు, చంద్రబాబు తోడల్లుడు పరుచూరి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేసారు.

నిన్న చంద్రబాబు పర్చురు నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్‌ అధినేతి సోనియా హయాం అవినీతి రాజ్యంగా మారిపోయిందంటూ చేసిన విమర్శ లపై స్పందిస్తూ బుధవారం ఆయన పలు ఆరోపణలతో మీడియాకు ఓలేఖ విడుదల చేసారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సమయంలో వేలలో చందా లు వసూళ్లు చేసుకున్న ఘనుడు చంద్రబాబేనని, ఈవిషయం తెలిసి ఎన్టీఆర్‌ తో మందలింపులించినా కలక్షన్లు చేయటం మానలేదని, తరువాత తాను అధి కారంలోకి వచ్చాక కూడా పార్టీటికెట్లు సైతం అముకున్నాడని ఆరోపించారు.

తాజాగా రాజ్యసభ సీట్లుని 20 కోట్ల చొప్పున అమ్ముకుని ఆ సొమ్ముతో టివి ఛానల్‌ కొన్న విషయం నిజ ం కాదా? అని నిలదీసారు. ఆపధర్మ ముఖ్య మంత్రిగా ఉంటూ గచ్చిబౌలిలో ఐఎంజికి వెయ్యి ఎకరాలు కేటాయించిన చంద్రబాబుకు ఎమ్మార్‌లో విల్లులు ఉన్న సంగతి వాస్తవంకాదా? అని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు హస్తం ఉందని, అవినీతికి ఆదు్యడెన అలాంటి వ్యక్తి తమ పార్టీ అధినేత్రి సోనియాని విమ ర్శించడం చూస్తుంటే నవ్విపోదురు నాకేటి సిగ్గనేలా ఉందని అన్నారు వెంకటేశ్వరరావు.