23, జూన్ 2011, గురువారం

కడపలో రూ. 10 లక్షల ఆభరణాల చోరీ

నగల దుకాణం యజమానిపై మత్తుమందు చల్లి 10 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన కడపలోని బీకేఎంలో వీధిలో గురువారం రాత్రి జరిగింది. ముగ్గురు దుండగులు ఈ దొంగతానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.