23, జూన్ 2011, గురువారం

దేశంలో 1974 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు

దేశంలో 1974 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తుతున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రోజుకో కుంభకోణం బయటపడుతోందన్నారు. త్వరలో విమానాల కుంభకోణం కూడా బయటపడుతుందన్నారు. అవినీతి యూపీఏ ప్రభుత్వంపై పోరాటం చేసే వ్యక్తులకు తమ మద్దతు ఎల్లపుడూ ఉంటుందన్నారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై యూపీఏ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించిందన్నారు