23, జూన్ 2011, గురువారం

నాలుక చీరేస్తాం ! : పొన్నాలకు టీఆర్ఎస్ హెచ్చరిక

సీమాంధ్ర నాయకుల మోచేయి నీళ్లు తాగుతూ..వాళ్ల ప్రాపకంతో పదవులు పొందిన పొన్నాలది సీమాంధ్రుల ఆగడాలను నిలదీసిన జయశంకర్‌కు పదవులు ఇప్పించే స్థాయా... సొంత డబ్బా కొట్టుకుంటున్న పొన్నాల..డాలర్ లక్ష్మయ్యగా సమర్థత కంటే డబ్బే ప్రధానంగా రాజకీయాల్లో ఎదిగి, అక్రమంగా సంపాదించిన డబ్బు, అధికార మదంతో మాట్లాడుతున్నారని మధుసూదనాచారి ప్రశ్నించారు. "స్థాయి మరిచి చేస్తున్న మతిలేని ప్రేలాపనలు మానుకో. చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే నీ నాలుకను తెలంగాణ జాతి రెండుగా చీలుస్తుంది..జాగ్రత్త !'' అని హెచ్చరించారు.