1, జనవరి 2012, ఆదివారం

వాగ్దానాలు ప్రజల్లో... ఆచరణ పాతాళంలో...2011లో 'ఆరోగ్యం'

ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యం దృష్ట్యా ప్రకటించిన పథకాలు సరైన ముందస్తు ప్రణా ళిక లేకపోవడంతో అమలుకు నోచుకోలేదు. దీంతో వాగ్దా నాలు ప్రజల్లో, పథకాలు పాతాళంలో అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌,మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి రూపొందించిన జన ఔషది పథకానికి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురయ్యాయి.
ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి వినూత్నంగా 360 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, న్యూట్రిషన్‌ అధికా రులను నియమించడం, రూ. 96 కోట్లతో 114 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టగా, శిశు మరణాలు తగ్గించడానికి, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ను పటిష్టపరచడానికి ప్రణాళికా సంఘం సహ కారంతో రూ. 1331 కోట్లతో పథకాలు అమలు చేయడం వంటివి 2011లో వైద్య, ఆరోగ్య శాఖలో చేపట్టిన ప్రముఖ అంశాలుగా చెప్పుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 2005లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సలు 11 లక్షలకు చేరుకోవడం గొప్ప మలుపు. ఈ పథకంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని 22 నుంచి 40 శాతానికి పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి తోడు జాబితాలో మరి కొన్ని కొత్త వ్యాధులను చేర్చడం కొత్త అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో 942 వ్యాధు లకు ఉచిత చికిత్స పొందే అవకాశం నిరు పేదలకు లభిం చింది. మారుమూల పల్లె ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే 104 సంచార వైద్య కేంద్రాాలు ప్రశంసలు అందు కున్నాయి.
అయితే, ఏడాది చివర్లో వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోరుతూ సిబ్బంది దాదాపు రెండు నెలలుగా ఆం దోళనకు దిగడంతో ఆరోగ్య సేవలు స ్తంభించిపోయాయి. ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని నిస్స హాయులు, వృద్ధులు దీంతో ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆసుపత్రు లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించినప్పటికీ ప్రజల ఆదరణను చూరగొ నడంలో విఫలమైంది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ ఈ ఏడాది ప్రత్యేకంగా ఆసుపత్రుల పని తీరును పర్యవేక్షించడానికి ఐఎఎస్‌ స్థాయి అధికారిని ఓస్‌డిగా నియమించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 225 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం, అర్హత ఉన్న డాక్టర్లందరినీ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌,అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులలో భర్తీ చేశారు. 'జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష' ( నీట్‌ ) ద్వారా ఎంబీబీ ఎస్‌ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన తో రాష్ట్ర విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన నెలకొం ది. జాతీయ స్థాయి పరీక్షతో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుం దని గ్రహించిన ప్రభుత్వం పరీక్షను ఒక విద్యా సంవత్సరం పాటు పరీక్షను వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కొద్ది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టెన్షన్‌లో పెట్టిన ఈ అంశం నీట్‌ నుంచి రాష్ట్రానికి ఏడాది మినహా యింపు ఇస్తున్నట్లు ప్రకటన రావడంతో ముగిసింది. రాష్ట్రంలో రేబీస్‌ మరణాలు అటు ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను వణికించాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని రాజ మండ్రి, కాకినాడ ప్రాంతాలలో ఈవ్యాధి బారిన పడి దాదాపు ఎనమిది మంది మృతి చెందడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఎలాగోలా వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖలను సమన్వయం చేసి రేబీస్‌ మరణాలకు అడ్డుకట్ట వేయగలిగింది.