1, జనవరి 2012, ఆదివారం

స్వార్థ పరుడిని : షారుఖ్‌

రా.ఒన్‌, డాన్‌ 2 సినిమాలు వరుసగా బ్రహ్మాండమైన విజయం సాధించడంతో షారుక్‌ ఖాన్‌ బాలివుడ్‌ను పాలిస్తున్నారనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ మధ్య వారి సినిమాలకు అనుమతులను పెద్దఎత్తున పెంచడం కోసం దేశం మొత్తం పర్యటించిన సమయంలో ప్రజల నుండి అద్భుతమైన రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. జీన్యూస్‌లో ప్రసారమయ్యే కహియే జానబ్‌, స్వాతి చతుర్వేదితో జరిపిన ముఖాముఖి కార్యక్రమంలో షారుక్‌ ఖాన్‌ రాజకీయాలు మొదులుకొని, అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమం, లోక్‌పాల్‌ బిల్లు, భారత రత్నలకు సంబంధించి అనర్గళంగా మాట్లాడారు. రాజకీయాలలో ప్రవేశించి ప్రధాన పాత్రపోషించనున్నారా? అన్న ప్రశ్నకు 'నేను చాలా కాలం నుండి చిత్ర జగత్తులో ఉన్నాను. ఒక్కసారి వృత్తిని మార్చలేను. రాజకీయాలనేవి జీవిత కాలంపాటు చేయాల్సినవి. రాజకీయాలలో ప్రవేశించడం అంటే వృత్తిని అందుకోసం అంకితం చేయడం. వృత్తి రాజకీయం అంటే రాజకీయ నాయకుడు నిస్వార్ధంగా ఉండి,ప్రజలతో మమేకమై జీవిత కాలంపాటు సేవచేయడం. నేను స్వార్ధ పరుణ్ని కాదు. నాకు రాజకీయాలు తెలియవు. విలేఖరులు ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు మీరు మొన్న ఒక రాజకీయ నాయకుణ్ణి కలిశారు. వారి పార్టీలో చేరుతున్నారా? అని వారికి నేను మీరు ఆ నాయకుల్ని ఎందుకు అడగరు సినిమా లో ప్రవేసిస్తున్నారా? అని' అంటూ షారుక్‌ తనదైన శైలిలో మాట్లాడారు. అన్నా హజారే లోక్‌పాల్‌ ఉద్యమం గురించి మాట్లాడుతూ 'ప్రతి ప్రజాస్వామ్య దేశంలో తీర్పరి (ఓమ్‌బుడ్స్‌మెన్‌) నియామకం అవసరం. అది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాంటిది. పౌర, ప్రభుత్వ లోక్‌పాల్‌ బిల్లుల రెండింటిలో లోపాలు లేకపోలేదు. ఆ రెండింటిని సవరించి నూతన విధి విధానాలను రూపొందించడం ఎంతైనా అవసరం' అన్నారు.
ఈ మధ్య ప్రముఖంగా వినిపిస్తున్న క్రీడాకారులకు, సినిమా నటీనటులకు సచిన్‌, ద్యాన్‌ చంద్‌లను భారత రత్నల జాబితాలో చేర్చాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ 'దేశంలో చారిత్రక వ్యక్తులు ఇంకా ఉన్నారు. అలాంటి వ్యక్తులకు భారత రత్నాలాంటివి ఇవ్వకపోయినా వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం మన కర్తవ్యం' అంటూ షారుక్‌ ఖాన్‌ అన్ని విషయాల పట్ల స్పష్టంగా, సూటిగా తన ధోరణిలో పరిణత వాణిని వినిపించారు.