30, జనవరి 2011, ఆదివారం

బూజు దులుపుతున్న కమల్ హాసన్

పేరుకే లోకనాయకుడు కానీ ఈ మధ్య తన న్యాచురల్ మార్కును కోల్పోతున్న కమల్ హాసన్ మళ్ళీ ఓ పాత సినిమాను నెత్తికెత్తుకుంటున్నాడు. సుమారుగా పదిహేను ఏళ్ళ క్రితం 'మరుదనాయగం' అనే భారీ చిత్రాన్ని మొదలెట్టి మధ్యలో వదిలేసిన కమల్ ఇప్పుడు తాజాగా ఆ కథ బూజు దులిపే పనిలోపడ్డాడు.

అప్పటి ఈ సినిమా క్లిప్పింగులు, స్క్రిప్టు తెప్పించుకొని మరోసారి కొత్త నిర్మాతను వెతికిపట్టి ఈ మహాయోధుడి కథకు తెర మీద రూపం ఇచ్చే పనిలో మునిగిపోయాడు. మదురై సంస్థానం, పోలీగార్ ఉద్యమ కాలానికి సంబంధించిన ఈ కథలో అమోఘమైన హీరోయిజం ఉన్నప్పటికీ యాభై కోట్ల పైనే పెట్టుబడి కావాల్సి రావడంతో అప్పుడు సినిమాను నిలిపెసాడు. రజినీకాంత్ 'రోబో' సాధించిన విజయంతో రెండు వందల కోట్ల వరకు రిస్క్ చేసే నిర్మాతలు తమిళంలో తయారవడంతో మళ్ళీ 'మరుదనాయగం'కు కొత్త ఊపిరి ఊదేందుకు సిద్ధమయ్యాడు.

'మన్మథ బాణం' తుస్సుమంది ఇక ఈ 'మరుదనాయగం' ఏమంటుందో?

తుపాకి నుంచి సేకరణ