15, నవంబర్ 2011, మంగళవారం

పెద్ద కొలువుల వీల్స్‌”సివిల్స్‌’

సమాజంలో ఉన్నత హౌదా అంటే ఏ ఐఏఎస్సో, ఐఎఫ్‌ఎస్సో చదవాలన్న భావన నేటి తరంలో బలంగా నాటుకు పోయిందన్నది వాస్తవం. ఆదిశలోనే యువతరం సివిల్‌ సర్వీస్‌ల పరీక్షలలోఉత్తీర్ణత సాధించేందుకు రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతునే ఉండటం గమనిస్తునే ఉంటాం.
ఇందులో ఉత్తీర్ణులైన టాపర్లు సైతం ఐఎఫ్‌ఎస్‌ కన్నా ఐఎస్‌కే ప్రాధాన్యత ఇస్తుండటంతో దీని క్రేజీ మరీ పెరిగిపోతోందన్నది నిజం. అధికార దర్పంతో పాటు తక్కువ సమయంలోనే ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు, ఇన్నాళ్లూ.. తానైతే ఇలా చేస్తానంటూ...కలలు కన్న సమాజ సేవా పనులు చేస్తూ... మానసికంగా సంతృప్తి పొందటం ఒకటైతే... అన్నింటికి మించి ఉద్యోగ భద్రత,సాంఘిక హౌదా లభించే తీరు కూడా చాలా మేరకు ఐఏఎస్‌ వైపు ఆకర్షిస్తోందనటంలో సందేహం లేదు.
న్యాయవ్యవస్ధలో న్యాయమూర్తులు ఎన్ని తరహా న్యాయాలు చెప్పి ప్రజా హర్షాతిరేకాలు పొందినా.. జనం మధ్యకు రాలేరు. కానీ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. నిత్యం జనం మధ్య తిరుగాడుతూ వారి సమస్యల పరిష్కారానికి రాజ్యాంగపరంగా వందలాది పదవులను అనుభ వించే అవకాశాలు బోలెడున్నాయి. ఉద్యోగంలో చేరిన మరు క్షణం నుండి కనీసం మూడు దశాబ్ధాల పాటు దేశ, రాష్ట్ర పాల నా వ్యవస్ధలలో అంతర్భాగమై దేశ భవిష్యత్‌ని నిర్ధేశించే వినూ త్న అవకాశం సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులదే అనటంలో సందేహం లేదెవ్వ రికీ. ముఖ్యమంత్రి తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి ప్రధాని పదవి తరువాత ఉన్న త పదవిగా భావించే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి పదవి వరకు సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఎదిగే అవకాశాలున్నాయి. ప్రతి ఏటా మే నెలలో ప్రిలిమినరీ నిర్వహిస్తారు. ఇందులో ఉంటే 23 ఆప్షనల్స్‌లో ఒకటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలలో జనరల్‌ నాలెడ్జి పరీక్షలో విద్యార్ధి జ్ఞాపక శక్తికి మాత్రమే పరీక్షగా ఉండటంతో విద్యార్ధి యోగ్యత, చురుకు దనం, క్రమశిక్షణ, సహజ సామర్ధ్యాలను గుర్తించేలా లేకపోవటంతో 2011 నుండి ఈ పరీక్షలలో అనేక మార్పు లు చేపట్టారు. విద్యార్ధుల అవగాహన, నైతిక విలువలు ధర్మబుధ్ది తదిత రాలపైనా దృష్టి కేంద్రీకరించి ఆ తరహాలోనే పరీక్ష నిర్వహణకు సన్నా హాలు చేస్తున్నారు. పొరపాటుగా జవాబులు రాస్తే... అందుకు నెగిటివ్‌ మార్కులు ఇచ్చే విధానాన్ని అమలు చేయనున్నారు.
ఇక ఏటా ఈ సివిల్స్‌ పరీక్షలలో పాల్గొనే వారి సంఖ్య సగటున లక్షన్నర పైమాటే... 450 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 275 మార్కులకన్నా ఎక్కువ స్కోరు సాధిస్తే... మొయిన్స్‌కి సెలక్ట అవుతారు. ఖాళీల ప్రతిపది కన వీరిలో కనీసం తొమ్మిది వేల మంది మెయిన్స్‌కు ఎంపిక చేయబడ తారు. ఇందులో తొమ్మిది పేపర్లు ఉంటాయి. వీటిని డిస్క్రిప్టివ్‌ పద్దతిలో రాయాల్సి ఉంటుంది. అక్టోబర్‌ నెలలో ఈ పరీక్ష జరుగు ుంది. ఆపై నాలుగు నెలల తరువాత ఫలితాలు విడుదల చేస్తారు. ఇందులో 1500 మందిని ఇంటర్వూలకు ఆహ్వానిస్తారు. ఇంటర్వూలో మెయిన్స్‌లో సాధించిన మార్కులకు ఇంటర్వూలో వచ్చిన మార్కులు కూడా కల్పి 500 మందిని ఎంపిక చేస్తారు. ఇలా ఇంటర్వూ వరకు వచ్చి కూడా ఎంపిక కాలేక పోతే వారు తమ లక్ష్యం చేరుకునేందుకు తిరిగి ప్రయాణం ప్రారంభించాల్సిందే...
సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాయాలనుకుంటే...
ఖచ్చితంగా 21 ఏళ్ల వయసు నిండి డిగ్రీ పూర్తయినవారే కాకుండా డిగ్రీ చదువుతున్న వారు, ఇపðడే ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న విద్యార్ధు లు సైతం సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను రాయచ్చు. ప్రత్యేకంగా మార్కు ల నిబంధన లుంటూ లేవు.డిగ్రీలో సైన్స్‌ విభాగం చదివిన విద్యా ర్ధులు సివిల్‌ సర్వీస్‌ పరీక్షలలో ఆప్షన్లని ఎంచుకోవటానికి అనేక రకాల సంశయాలతో కాలం గడిపేస్తుంటారు. తాము చదివిన సబ్జక్టని కాకుండా విరివిగా మెటీరియల్‌ దొరికే సామాజిక శాస్త్రం, ఆర్ట్స్‌ సబ్జక్టుల వైపు దృష్టి పెడుతుంటారు. కొంత కాలం వీటిపై దృష్టి పెట్టి చదువుతూ... అందులో ఇమడలేక మరో కొత్త సబ్జక్టు వైపు చూడటంతో కాలం కాస్త కుచించుకుపోయి... మీలో ప్రిపరేషన్‌ తగ్గి పోతుంది. సరదాగా రాద్దాం ఓసారనే భావనతో ఈ పరీక్షని సీరి యస్‌గా తీసుకోని వారు కూడా చాలా మంది మనకి తారసపడుతుంటారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎపðడూ సివిల్స్‌కి ప్రిపేర్‌ కాకపోవటం మంచిది.
సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించాలంటే కఠోర పరిశ్రమ, తొలి అవ కాశంలోనే దక్కించుకోవాలన్న తపన మీలో ఏర్పరుచుకుని ఆప్షన్స్‌ ని ఎంచుకునే విధానంపై దృష్టి పెడుతూనే జనరల్‌ స్టడీస్‌పై కూడా ప్రిప రేషన్‌ ప్రారంభించాలి. ఇపðడోసారి పరీక్ష ఎలా ఉందో చూద్దాం.. వచ్చే ఏడాది పూర్తిస్ధాయిలో ప్రిపరేషన్‌ చేద్దాం అనుకుని పరీక్షకు వెళితే... ఆపై ప్రిపరేషన్‌ మీకే బోర్‌ కొట్టి లక్ష్యం చేరువయ్యేందుకు ఆదిలోనే విఘాతాన్ని మీరే కలిపించుకున్న వారవుతారు.
2011 నుండి సివిల్‌ సర్వీస్‌ రిక్యూట్‌మెంట్‌ పరీక్షా విధానంలో అనేక మార్పులు తీసుకు రావాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో మార్పులు లేకపోయినా జి.కె పరీక్ష స్ధానంలో విద్యార్ధి లో నైతిక విలువలు, సమయోచిత నిర్ణయాలు తీసుకునే విధానాలను, బుధ్ధి కుశలతను తెలుసుకునేందుకు ప్రిలిమినలో ఆప్టిట్యూడ్‌ పరీక్షని నిర్వహించనున్నారు. దీనివల్ల సహజ సామర్ధ్యం, నైతిక విలువలను , మనిషి మనో విశ్లేషణకు, సమయస్పూర్తిని తెలుసుకోవచ్చని యోచిస్తూ ఈ విధానం ప్రవేశ పెట్టారు. దీంతో ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షలో ఉన్న ఆప్షనల్‌ పేపర్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ పేపర్‌ల స్ధానంలో ఆప్టిట్యూడ్‌ పేపర్లు రెండు రానున్నాయి. ఈదిశగా సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నవారు తమ ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే మంచిది.
ప్రస్తుతం జరుగుతున్న మార్పుల కారణంగానే యూపిఎస్సీ వచ్చే ఏడాది నిర్వహించాల్సిన పరీక్షల షెడ్యూల్‌ని ప్రకటించలేదని వార్తలొస్తున్న నేపధ్యంలో ప్రిలిమ్స్‌పరీక్షకు జనవరి-2012లో నోటిఫికేషన్‌ వచ్చే అవ కాశాలున్నాయని ఓ అంచనా. ధరఖాస్తులు సమర్పించేందుకు ఫిబ్రవరి వరకు సమయం ఉంటుంది. ఇక అర్హత పరీక్ష మొత్తం 450 మార్కుల కు ఉంటుంది. వీటిలో 150 మార్కులు కంపల్సరీ జనరల్‌స్టడీస్‌పైన, ఆప్షనల్‌ పేపర్‌ 300 మార్కు లకీ ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌లో కరంట్‌ ఎఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జి, పొలిటికల్‌, జనరల్‌ సైన్స్‌, భౌగోళిక శాస్త్రం, ఆర్ధిక వ్యవస్ధ, మెంటల్‌ అబిలిటీలుంటాయి. ఇందులో కంరెంట్‌ ఆఫైర్స్‌, రాయకీయాలు, భౌగోళిక వ్యవస్ధలపైనే ఎక్కువ ప్రశ్నల పరం పర వస్తుండటం వల్ల దీనిపైన దృష్టి కేంద్రీకరించి, ఏకాగ్రతతో ప్రిపేర్‌ అవుతూ... ఎప్పటికపðడు గ్రూప్‌ డిస్కషన్స్‌ ద్వారా మీలో రేగే అనేక రకాల అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగితే.. సివి ల్స్‌ పరీక్షలలో విజయం సాధించవచ్చు.